ఈ ప్రశాంత సంద్యవేళలో,
రవి శిఖరాల చాటునకు చేరగా,
పిల్లగాలి చల్లగా మనసును నిండగా,
నా ఉహాలు అంబరాన్ని తాకేనుగా.
ప్రకృతి అందంగా పల్లవించగా,
కోయిలమ్మ కమ్మగా రాగం అందించగా,
నా మనస్సు తీయగా పాటను పాడగా,
నా ఎదలోని ఆనందం పురివిప్పి నాట్యం చేసింది.
సెలయేరు వయ్యారంగా నడవగా,
అంబరమే దానిని చూచి ముచ్చటపడగా,
ఆకాశ విధిలో నక్షత్రాలు స్వాగతం పలుకగా,
చందమామ నా మనసులో కలసిపోయింది.
నిశిని తొలగిస్తూ తన వెన్నేల పంచగా,
పక్షులు అలసి సొలసి తమ గూళ్ళకు చేరగా,
అబ్బురపరిచే సంబరాలు వీక్షించగా,
ఆకాశం పరిచిన వెచ్చని దుప్పటిలో నా మది చేరింది...!
No comments:
Post a Comment